Followers

31 July, 2020

షహీద్ ఉదమ్ సింగ్ గారి వర్ధంతి

🌹🇮🇳నేడు స్వాతంత్ర్య యోధులు "షహీద్ ఉదమ్ సింగ్" గారి వర్ధంతి🇮🇳🌹

👉షహీద్‌… ఈ పేరు కూడా తెలియని వారు మనలో చాలా మందే ఉంటారు. అణగారిన వర్గాల నుంచి వెలుగులోకి వచ్చిన ఎవరికీ పెద్దగా గుర్తింపు లభించలేదన్నదానికి షహీద్‌ ఉద్దమ్‌ సింగ్‌ జీవితమే నిదర్శనం. సిక్కుల ఆ రోజు సిక్కుల పర్వదినం బైసాఖి… హిందువుల పండుగ రామ నవమి… రెండు పర్వదినాలు ఒకే రోజు వచ్చాయి. ఈ రోజున ఓ పార్కులో బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. ముస్లీం సోదరులు కూడా ఈ సభలో పాల్గొన్నారు. నేతల ప్రసంగాలు వింటున్నారు. గుండు సూది వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది. ఈ సమయంలో సాయుధ పోలీసులు ఆ పార్కును చుట్టుముట్టారు. రాకపోకలు సాగించే చిన్నటి సందులో పోలీసులు నిలబడ్డారు. అత్యాధునికమైన మెషిన్‌ గన్స్‌ తో రెడీగా ఉన్నారు. ఈ పోలీసుల నాయకుడు ముందుకొచ్చాడు. వచ్చిరావడంతోనే ‘ఫైర్‌’ అంటూ ఉన్మాదిలా అరిచాడు. ఇంకేముంది పోలీసుల చేతిలో ఉన్న మెషిన్‌ గన్స్‌ గర్జించాయి. మొత్తం 1650 రౌండ్లు కాల్పులు జరిపారు. దీనితో సభలో పాల్గొన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏమైందో తెలుసుకునే లోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. వేలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రాణాలు రక్షించుకుందామనుకుని తలో దిక్కుకు పరుగులు తీశారు. అక్కడనే ఉన్న బావిలోకి దూకారు. దాదాపు పది నిమిషాల లోపు దాదాపు వేయి మంది నేలకొరిగారు. మరో 1500 మందిదాక తీవ్రంగా గాయపడ్డారు. బావి నుండి సుమారు 120 మంది మృతదేహాలు బయటపడ్డాయి. పవిత్ర పండుగ దినాన మృత్యుఘోష దద్ధరిల్లింది. అత్యంత హేయమైన ఈ సంఘటన భారతదేశంలోని పంజాబ్‌ లోని ‘జలియన్‌ వాలాబాగ్‌’లో చోటు చేసుకుంది. భరత జాతి గుండెకైన ఈ పెను గాయం ఎప్పటికీ మాననంత తీవ్రమైంది. యావత్తు భారతదేశమే దిగ్భ్రాంతికి లోనైంది. మాటలకందని విషాదం..కాల్పులు జరిపింది ఎవరో కాదు బ్రిటీష్‌ సైనికులు ఫైర్‌ అంటూ కాల్పులకు ఉసిగొల్పిన పోలీసు అధికారి బ్రిగేడియర్‌ జనరల్‌ రెజినాల్డ్‌ డయ్యర్‌. మరొకడు పంజాబ్‌ రాష్ట్ర లెఫ్టినెంట్‌ జనరల్‌ మైఖెల్‌ ఓడ్వయెర్‌. దీనిపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో 1920లో బ్రిటీష్‌ ప్రభుత్వం కంటి తడుపు చర్యగా జనరల్‌ డయ్యర్‌ ను తొలగించింది. కానీ లెఫ్టినెంట్‌ జనరల్‌ మైఖేల్‌ను ప్రమోషన్‌పై సొంత దేశానికి పిలిపించుకుని తన నిజస్వరూపాన్ని బైట పెట్టుకుంది. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూశాడో ఓ కుర్రాడు. అతడికి 11 ఏళ్లు ఉంటాయి. సమావేశానికి వచ్చే వారికి మంచినీళ్లు అందించాడు. తరువాత జరిగిన ఘోరాన్ని చూసి తట్టుకోలేక పోయాడు. భరతమాతకీ జై… అంటూ నేలకొరుగుతున్న వారిని చూసి చలించిపోయాడు. దేశాన్ని ఎంత ప్రేమిస్తున్నారో అతడికి అర్థమైంది. బ్రిటీష్‌ పాలకులపై పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. చిన్ని పిడికెడు గుండెలో కడలిని వీరావేశం ఉప్పొంగింది. తనకు జన్మనిచ్చిచన భరతమాత రుణం తీర్చుకోవాలనుకున్నాడు. ఇందుకోసం ఒకటి కాదు రెండు కాదు 21 ఏళ్లు నిరీక్షించాడు. తనవారిని దారుణంగా కాల్చి చంపిన దుష్టుడు లెఫ్టినెంట్‌ జనరల్‌ మైఖేల్‌ ఓడ్వయెర్‌ను కాల్చిచంపాడు. ఇతడిని ఎక్కడ చంపాడని అనుకుంటున్నారా? వాడి దేశంలోనే వాడి ప్రజల మధ్య కాల్చి చంపాడు. కన్న భూమి రుణం తీర్చుకున్నాడు ఈ విప్లవ ధీరుడు… అతడే. షహీద్‌ ఉద్దమ్‌ సింగ్‌. అనంతరం అరెస్టు అయిన షహీద్‌ లండన్‌ కోర్టులో హాజరు పరిచారు. నా దేశ ప్రజల ఆంకాంక్షను అణిచివేసిన నరహంతకుడిని మట్టుబెట్టాను… ఈ పరాయి పాలన నా దేశానికి శాపంలా మారింది… ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది… వందేమాతరం… దేశం కోసం ప్రాణాలివ్వడానికి భయపడను… గర్వపడుతా అంటూ గర్జించాడు. ఉరికొయ్యలను ముద్దాడాడు. దేశమాత దాస్యశృంఖలాల విచ్ఛేదం కోసం ప్రాణాలర్పించిన ఎందరో తాగ్యధనుల మహోన్నత చరిత్రలో షహీద్‌ ఓ ఉజ్వల తార. తాను ఏం చేసినా, ఏ ప్రాంతంలో ఉన్నా తన ముందున్న లక్ష్యం ఏమిటో షహీద్‌ ఉద్ధం సింగ్‌కు తెలుసు. తన చిన్న తనంలో జరిగిన జలియన్‌ వాలాబాగ్‌ దురంతం, అప్పుడు జరిగిన మారణహోమం మాత్రం మర్చిపోలేడు. తాను నిర్దారించుకున్న లక్ష్యం ఆయన మనసులో స్పష్టంగా ఉంది. తన ప్రజల ఊచకోతకు కారకుడైన నరహంతక మైఖేల్‌ ఓడ్వయెర్‌ను ఎలాగైనా దునుమాడాలి. తన దేశానికి జరిగిన తీవ్ర పరాభవమానాలకు ప్రతీకారం జరగాలి. ఇదీ తన అత్యంత రహస్య ఎజెండా. కానీ తన లక్ష్యం నెరవేరేదెలా? 1940, మార్చి13న తన సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. తను ఎవరినైతై లక్ష్యంగా పెట్టుకున్నాడో అతనిప్పుడు తన స్వదేశమైన ఇంగ్లాండ్‌లో ఉన్నాడు. అతడ్ని హతమార్చడం అనుకున్నంత సులభం కాదు. అయితే సులభం కాక పోయినా అసాధ్యం మాత్రం కాదని షహీద్‌కు తెలుసు. తను లక్షంగా పెట్టుకున్న శత్రువు లండన్‌లోని క్యాక్సటన్‌ హాలులో ఒక ముఖ్యమైన సమావేశానికి వస్తున్నాడన్న కచ్ఛితమైన సమాచారం అందింది. మైఖేల్‌ ఓడ్వయర్‌ ఈస్టిండియా అసోసియేషన్‌, సెంట్రల్‌ ఏషియన్‌ సొసైటీల సంయుక్త సమావేశంలో ముఖ్య ఉపన్యాసకుడు. వెంటనే షహీద్‌ ఉద్ధం సింగ్‌ అచ్చం బ్రిటీష్‌ దేశస్థుడిలా సూటూ, బూటూ, టోపీతో తయారై సమావేశం జరగనున్న భవనానికి చేరుకున్నాడు. ప్రవేశ ద్వారం వద్ద తనిఖీ కోసం ఉద్ధం సింగ్‌ను గార్డ్‌ ఆపాడు. అతని చేతిలోని పుస్తకాన్ని తీసుకుని అటూ ఇటు తిప్పి సరిగ్గా చూడకుండానే తిరిగి ఇచ్చేశాడు. అదే అతను చేసిన పెద్ద తప్పు. ఆ పుస్తకంలోనే షహీద్‌ ఉద్దమ్‌ సింగ్‌ ఆయుధమైన రివాల్వర్‌ను దాచాడు. బైటకు అదేం కన్పించకుండా గంభీరంగా పుస్తకం. అదే ఆయుధం తీసుకుని వేటాడే పులిలా లోనికి వెళ్ళాడు. సమావేశంలో మైఖేల్‌ ఆవేశంగా ప్రసంగిస్తున్నాడు. ఇండియాలో వేయి మంది భారతీయ శత్రువులను పది నిమిషాల్లోనే ఖతం చేశా… అవసరమైతే ఆ పంజాబ్‌ జలియన్‌ వాలాబాగ్‌ లాంటి ఘటనను ఆఫ్రికాలో కూడా రిపీట్‌ చేస్తాను అని మైఖేల్‌ పేర్కొన్నాడు. అది విన్న ఉద్దం సింగ్‌ వేడి రక్తం ఉప్పొగింది. ఒక్క క్షణం అలస్యం చేయకుండా ముందుకు కదిలాడు. నీకు ఆ అవకాశం మరోసారి ఇవ్వన్రా అంటూ ఉద్దం సింగ్‌ సూటిగా ఓడ్వయర్‌ పైకి రివాల్వర్‌తో కాల్చాడు. మూడు, నాలుగు బుల్లెట్లు ఓడ్వయర్‌ శరీరాన్ని తూట్లు పొడిచాయి. అక్కడికక్కడే కుప్పకూలాడు ఓడ్వయర్‌. బ్రిటీష్‌ అధికారి మైఖేల్‌ ఓడ్వయర్‌ దారుణ హత్య వార్త క్షణంలో ఇంగ్లాండ్‌తో పాటు ప్రపంచమంతా వ్యాపించింది. ఇంగ్లండ్‌ ప్రభుత్వం షాక్‌కు గురైంది. ఒక ముఖ్య ఉన్నతాధికారిని కాపాడుకోలేకపోవడం సాటి దేశాల ముందు తల తీసేసినట్టయింది. బ్రిటీష్‌ ప్రభుత్వం అవమాన భారంతో తల దించుకుంది. జలియన్‌ వాలాబాగ్‌ హత్యాకాండకు ప్రతీకారంగానే ఓడ్వయర్‌ హత్య జరిగిందని జర్మన్‌ ప్రోపగండా మిషన్‌ అన్ని విషయాలను కుండ బద్దలు కొట్టింది. భారతీయుల బతుకులను బుగ్గి చేస్తున్న బ్రిటీష్‌ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టిచ్చేందుకే దుర్మార్గుడైన ఓడ్వయర్‌ను కాల్చి చంపానని ఉద్ధం సింగ్‌ కోర్టులో ప్రకటించాడు. నాకు ప్రాణభిక్ష అవసరం లేదు… నేను దేశం కోసం జీవితాన్ని ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాను… రక్తం తాగే జలగల్లాంటి సామ్రజ్యవాదులైన మీరు నాదేశం నుంచి వెళ్ళిపొండి… మా దేశ ప్రజలకు స్వేచ్ఛనూ, నిజమైన జీవితాన్నీ ఇవ్వండి… అని ఉద్ధం సింగ్‌ పేర్కొన్నాడు. కుల, మత, వర్గ విభేదాలు సృష్టించి విభజించు – పాలించు అన్న సిద్ధాంతాన్ని అనుసరిస్తన్నారే… అందుకే నేను నా పేరును రామ్‌ మహ్మద్‌ సింగ్‌ ఆజాద్‌గా మార్చుకున్నాను… అని ప్రకటించాడు. నేనిప్పుడు నేలకొరిగినా వేలాది మంది భారతీయులు అగ్నికీలలై ఉవ్వెత్తున లేస్తారు. అని గర్జించాడు… నేను ఇంగ్లీషు కూలీలకు, రైతులకు, కార్మకులకు వ్యతిరేకం కాదు… సామ్రాజ్య వాద శక్తులు మాత్రమే నాకు శత్రువులు… అని తన వర్గదృక్పథాన్ని చాటుకున్నాడు. 1940, జులై 31 ధైర్య సాహసానికి, త్యాగ దీక్షకు ప్రతీక అయిన భరతమాత ముద్దు బిడ్డ నేలకొరిగాడు. ఇంగ్లండ్‌ జైలులోనే ఉద్ధం సింగ్‌ను ఉరితీసింది బ్రిటీష్‌ ప్రభుత్వం. ఈ మహాత్యాగం 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమానికి ముఖ్య భూమిక అయ్యింది. 1919లో బ్రిటీష్‌ ప్రభుత్వం రౌలత్‌ చట్టం తెచ్చింది. దేశంలో ఏ ప్రాంతంలోనైనా నిరవధికంగా అంటే ఇంత గడువని లేకుండా ఎమర్జెన్సీ విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. నిజానికి బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు జరగకుండా నిరోధించడమే ఈ కొత్త చట్టం. ఈ చట్టంపై మహాత్మాగాంధీ వ్యతిరేకత తెలిపాడు. ఆయన పిలుపునందుకుని దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. పంజాబ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకులైన డాక్టర్‌ సత్యపాల్‌, డాక్టర్‌ సైఫుద్దీన్‌ కిచ్లూ చట్టాన్ని తిరస్కరించాలని ప్రజలకు ఉద్భోదించారు. వలస ప్రభుత్వం ఈ ఇద్దరి నేతలను అక్రమంగా నిర్భంధించింది. పోలీసులు వారిని రహస్య ప్రదేశానికి తరలించారు. దానితో పెల్లుబికిన ప్రజాగ్రహ ఫలితమే జలియన్‌ వాలాబాగ్‌ సమావేశం. రౌలత్‌ చట్టాన్ని గౌరవించబోమని ముక్తంకంఠంతో నినదించారు. బ్రిటీష్‌ సర్కారుపై, చట్టాలపై తిరగబడితే పట్టబోయే గతేంటో చాటాలనుకుంది. అందుకోసం కరడుగట్టిన పోలీసు అధికారులను రంగంలోకి దింపింది. ప్రజల ఊచకోత ద్వారా దేశంలో భయాందోళనలు సృష్టించాలనుకుంది. జలియన్‌ వాలాబాగ్‌ దుర్గటన వెనుక ఉన్న మర్మమిదే. షహీద్‌ ఉద్ధం సింగ్‌ దళిత సిక్కు కుటుంబంలో జన్మించాడు. అమృత్‌సర్‌కు 200 మైళ్ల దూరంలోని సునమ్‌ అనే గ్రామంలో పుట్టిన ఉద్ధం నిజంగా సునామీనే సృష్టించాడు. తండ్రి సర్దార్‌ తెహసిల్‌ సింగ్‌ రైల్వే క్రాసింగ్‌ వాచ్‌మెన్‌. ఉద్ధం చిన్నతనంలోనే తల్లి మరణించింది. ఆ తరువాత తన ఇద్దరు పిల్లలైన ఉద్ధం సింగ్‌, సాధూ సింగ్‌ను అనాధాశ్రమంలో చేర్పించాడు. తరువాత తండ్రి కూడా గతించడంతో ఉద్ధం అనాధ అయ్యాడు. స్వతంత్ర సమరంలో చెరగని ముద్ర వేసిన ఉద్ధం సింగ్‌ నివసించిన ఇల్లు సునమ్‌ గ్రామంలో ఇంకా ఉంది. దేశ స్వాత్రంత్యం కోసం ఉద్యమాలు పలు మార్గాల్లో కొనసాగుతున్నాయి. కొందరు శాంతియుత మార్గాన్ని ఎంచుకుంటే మరికొందరు విప్లవ మార్గాన్ని అనుసరించారు. మార్గాలు వేరైనా అందరి లక్ష్యం ఒక్కటే బ్రిటీష్‌ వలస పాలనకు చరమగీతం పాడడం. అయితే విప్లవ పోరాటాల ద్వారా మాత్రమే దేశానికి స్వాతంత్య్రం వస్తుందన్న భగత్‌ సింగ్‌, సుభాష్‌ చంద్రబోస్‌, ఉద్ధం సింగ్‌ లాంటి వారిని వలస ప్రభుత్వం… భారత దేశ తొలితరం మార్క్సిస్టులుగా అభివర్ణించింది. ఉగ్రవాదులుగా ముద్రవేసింది. అమృత్సర్‌ సిక్కుల పవిత్ర నగరం. ఇక్కడే జాతీయ భావాలు వంటబట్టించుకున్నాడు. ధైర్య సాహసాలు, త్యాగనిరతి, క్రమ శిక్షణ వంటి జీవితపు మహత్తర విలువలు వంటబట్టించుకున్నాడు. 1919లో ఈ నగరమే దేశమంతటా స్వాతంత్య్ర కాంక్షను, జాతీయ భావాలను ప్రజ్వరిల్ల జేసింది. ఆ సమయంలో రౌలత్‌ చట్టం రావటంతో అప్పటికే నరనరాన దేశ భక్తి జీర్ణించుకున్న ఉద్ధం ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకాడు. రౌలత్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగే ఆందోళనల్లో పాల్గొన్నాడు. తీవ్రవాద మార్గం ఎంచుకున్న ఉద్ధం సింగ్‌ గదర్‌ సంస్ధలో సభ్యుడయ్యాడు. ఈ విప్లవ సంస్ధను సోహాన్‌ సింగ్‌ భక్నా స్ధాపించాడు. భగత్‌ సింగ్‌ రాజగురూ వంటి వారిని తన రాజకీయ గురువులుగా చేసుకున్నాడు. విప్లవ కార్యకలాపాలు కొనసాగించే కాలంలో తన ఉనికి ఎవరికీ తెలియకుండా రకరకాల వేషాలు మార్చాడు. పేర్లూ మార్చాడు. షేర్‌ సింగ్‌, ఉదాన్‌ సింగ్‌, ఉదే సింగ్‌, ఫ్రాంక్‌ బ్రెజిల్‌, వంటి అనేక పేర్లతో ఉద్ధం సింగ్‌ కొనసాగాడు. ఒక సందర్భంలో దేశంలోని మూడు ముఖ్య మతాలకు చిహ్నంగా తన పేరును రామ్‌ మహ్మద్‌ సింగ్‌ ఆజాద్‌ అని ప్రకటించుకున్నాడు. 1924లో ఉద్ధం అమెరికా వెళ్ళడానికి అతనికున్న నేపథ్యం దృష్ట్యా పాస్‌ పోర్టు వంటి అనుమతి పత్రాలు ఎలా లభించాయన్నది ఇప్పటికీ చిదంబర రహస్యమే. బ్రిటీష రహస్య నివేదిక ప్రకారం ఉద్ధం మొదట ఇటలీ చేరుకుని, అక్కడ్నుంచి ఫ్రాన్స్‌, స్వాట్జర్లాండ్‌, ఆఫ్రికా మీదుగా ఇంగ్లాండ్‌ చేరుకున్నాడు. అక్కడే రహస్య జీవితం గడుపుతూ మైఖెల్‌ ఓడ్వయెర్‌ను కాల్పిచంపాడు. ఉద్ధం చేసిన త్యాగం మహా ఉద్యమానికే ఊపిరి అయ్యింది.

💟💟💟💟💟💟💟💟💟💟

మహమ్మద్ రఫీ గారి వర్ధంతి



24 July, 2020

సర్ ఆర్థర్ కాటన్ గారి వర్ధంతి


@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @

🌹నేడు "సర్ ఆర్థర్ కాటన్" గారి వర్ధంతి🌹

👉ఎందరో మహానుభావుల జీవితములు మనకు మార్గదర్శనములు, నిరంతర స్ఫూర్తిదాయకములు. అటువంటి మహానుభావులలో ఒకరైన సర్ ఆర్థర్ కాటన్ గారి వర్ధంతి సందర్భముగా వారి కృషి, దీక్ష, మానవత్వము గురించిన కొన్ని విశేషములు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు గారి మాటలలో…

👉సర్ ఆర్థర్ కాటన్ ఒకప్పుడు బర్మా నుంచి సముద్రం మీద వచ్చేస్తున్నారు. చీకటి పడింది, చల్లటి గాలి వేస్తోంది. ఆ ఓడ యొక్క పై భాగం మీదకి ఎక్కి కూర్చున్నారు. కూర్చుని ఆకాశం వంక చూస్తున్నారు. ఆకాసంలో నక్షత్రాలు మిణుకు మిణుకుమని మెరుస్తున్నాయి, మధ్యలో చంద్రబింబం వెలుగుతోంది. ఆయనకు ఆకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది – “నేను ఒక చిన్న ఆనకట్ట కడితేనే చాలా గొప్ప అనుకుంటానే, అలాంటిది ఇన్ని నక్షత్రాలు, చంద్రుడు, నదులు, సముద్రాలు, మన శరీరము, బుద్ది ఇన్నిటిని సృష్టించిన పరమేశ్వరుడికి మనము ఏమివ్వగాలము? ఆయన సంతోషించేలా బ్రతకాలి…భగవంతుడు సంతోషించేలా బ్రతకడమంటే మనిషిలా బ్రతకడమే. అంటే నా కోసము, నా సంతోషము కోసము మాత్రమే బ్రతుకకుండా, ఎవరు కష్టంలో ఉన్నా ఆదుకోవటానికి నేను వెళ్ళటమే…” అంతే, అది కాటన్ జీవితాన్ని మార్చేసింది. గబగబా ఓడ క్రిందకు వెళ్లి, తన మత పవిత్ర గంథాన్ని తీసుకుని చదువుకున్నారు. ఇక అక్కడనుంచి కాటన్ జీవితాన్ని చూస్తే, ఎక్కడ ఎవరు ఆపదలో ఉంటె అక్కడకు వెళ్ళేవారు.@శ్రీనివాస్@

👉ఒకప్పుడు విశాఖపట్నంలో కాటన్ తిరుగుతున్నారు. తుఫాను వాతావరణం. కొబ్బరి బొండాలు, అరటిపళ్ళ గెలలతో ఒక మాదిరి ఓడ అక్కడకు వచ్చింది. కొంత మంది దొంగలు ఒక గుంపుగా ఆ ఓడ చుట్టూ చేరి కర్రలు పట్టుకుని కేరింతలు కొడుతూ ఆ ఓడలోని వారిని అదిలిస్తున్నారు. ఆ చిన్న ఓడ కెరటాలకు, రాళ్ళకు కొట్టుకుని బద్దలైపోతే, అందులో ఉన్న మనుషులు చల్లా చదర అయ్యిపోతే, ఆ కొబ్బరి బొండాలు, అరటిపళ్ళు దోంగాలించచ్చు అని వాళ్ళ ఆలోచన. ఇంత పశుత్వముతో సాటి మనుషులు ఒడ్డున దిగటానికి లేక భయపడుతుంటే, వాళ్ళని కర్రలతో అదిలించి, బొండాలు, పళ్ళు ఎత్తుకుపోవటానికి చూస్తున్నారు…ఈరోజు వీళ్ళని నియంత్రించి, ఓడలోని వారికి సహాయము చేసి భగవంతుడు సంతోషించేలా జీవిస్తాను అని అనుకుని, కాటన్ ఒక దుడ్డు కర్రతో ఒక్కడే వాళ్ళందరిని అదిలించటం మొదలు పెట్టారు. ఒడ్డున ఒక మనిషి ఆసరా దొరకటముతో ఓడలోని వారంతా కూడా ధైర్యము గా కేకలు వేసి ఆ దొంగలని అదిలించి, వాళ్ళని అక్కడనుంచి పారిపోయేలా చేసారు. ఓడలోని వారంతా కాటన్ ని అభినందించి, కృతఙ్ఞతలు తెలిపినా తాను పొంగిపోకుండా, భగవంతుడు సంతోషించేలా జీవించానని ఆనందించారు.@శ్రీనివాస్@

👉ఆ తరువాతి కాలంలో ఈ దేశములోని రైతులు సంతోషించాలని ఆయాన పొందిన పరివేదన, ఆనక్కట్టలు కట్టటానికి పడిన కష్టము అనన్య సామాన్యము. ఒకప్పుడు ఆయన కోనసీమలో గోదావరి నది మీదనుంచి పడవలో వెళ్తున్నారు. ఒక ఒడ్డున దిగి నడిచి వెళ్తున్నారు. అక్కడ ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనము చేస్తూ “కాటన్ ఋషయేనమః” అని నమస్కారము చేసారు. ఇది విన్న కాటన్ కి తన పేరు తప్ప ఏమి అర్థము కాలేదు. అక్కడ ఉన్న ఇంకొక ఆయన్ని పిలిచి, ఆయన ఏమంటున్నారు అని అడిగారు. మీరే కాటన్ అని ఆయనకు తెలియదు కానీ మీకే ఆయన నమస్కారము చేస్తున్నారు. ఆశ్చర్యపోయిన కాటన్ ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్లి ఎందుకలా చేసారు అని అడిగారు. దానికి ఆ బ్రాహ్మణుడు “ఋషి అంటే ఎవరు? లోకము యొక్క క్షేమము కోసం తపించేవారు. ఇక్కడున్న రైతుల కోసము ఇంత కష్టపడి, గోదావరి మీద ఆనకట్ట కట్టి, ఇన్ని లక్షల ఎకరాలు సాగు అవ్వటానికి కారణము అయిన మీరు నా దృష్టిలో ఒక ఋషి. అందుకే మీకు కూడా నమస్కారము చేస్తూ సంధ్యావందనములో ఈ మంత్రము చెప్పాను” అన్నారు.@శ్రీనివాస్@

👉దానికి కాటన్ “ఈ దేశ ప్రజలకు ఎంత సంస్కారము! ఎంత కృతఙ్ఞతా లక్షణము!” అని సర్ ఆర్థర్ కాటన్ ఎంతో ఆనందించారు. మనిషికి ఇవ్వటములో ఒక గొప్ప సంతోషము ఉంటుంది. అందుకే “the hands that give are holier than the lips that pray”. ఇచ్చే చేతులు అంత పవిత్రము. ఒకరి కంటి నీరు తుడవటము కోసం ముందుకు వచ్చిన చెయ్యి, ఓదార్చటానికి చేసిన ప్రయత్నము, తన చుట్టూ ఉన్న వారికి ఉపకారము చెయ్యాలన్న తాపత్రయము మనిషిని మనిషిగా నిలబెడుతుంది. అలా బ్రతికిన వారెవరో,అట్టి మనుషులే మహానీయులౌతారు…..@శ్రీనివాస్@

💟💟💟💟💟💟💟💟💟💟

గుర్రం జాషువా గారి వర్ధంతి


@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @

🌹✍️నేడు "గుర్రం జాషువా" గారి వర్ధంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు✍️🌹

👉గుర్రం జాషువా తెలుగు సాహితీ పూతోటలో విర బూసిన సాహితీ సుగంధ పుష్పం. ఆయన పేరు వింటేనే మల్లెలు పరిమళాల్ని వెదజల్లుతాయి. కవి త్వమే ఆయుధంగా మూఢాచారా లపై తిరగబడ్డ మహా కవి. సంఘ సంస్కరణ ఆయన కావ్యలక్షణం. వర్గసంఘర్షణ, ఆర్థిక వ్యత్యాసాలు, దోపిడీ వర్గాలపై తిరుగుబాటు చేసిన ఈ అభ్యుదయవాది 1895 సెప్టెంబర్‌ 28న వీరయ్య, లింగమ్మ దంపతులకు జన్మించారు. జాషువ వినుకొండలో ప్రైమరీ స్కూల్లో చేరారు. స్కూల్‌లో చేరిన ప్పటి నుండి అంటరానితనం జాషువాను పీడించింది. ఎన్నో అవ మానాలను, కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నత విద్యను విను కొండలోనే విజయవంతంగా పూర్తి చేశారు. 1910లో మరియమ్మ ను వివాహం చేసుకున్నారు. మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతంపై ఉద్యోగం చేశారు. ఆ తర్వాత రాజమండ్రి వెళ్లి 1915-1916లలో అక్కడ సినిమా ప్రచారకునిగా పనిచేశారు.@శ్రీనివాస్@

👉టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణలను చదువ్ఞతూపోవ డమే సినిమా ప్రచారకుని పని. ఆ తర్వాత గుంటూరులో లూథ రన్‌ చర్చి నడుపుతున్నప్పుడు ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపా ధ్యాయుడిగా పది సంవత్స రాలు పనిచేశారు. ఇలా ఉపాధ్యాయ వృత్తిని మొదలుపెట్టినప్పటి నుండి అంటే చిన్నతనం నుండి జాషువాకు సాహిత్యం, కవిత్వా లపై ఎక్కువ మక్కువ ఉండేది.@శ్రీనివాస్@

👉అలాగే సృజనాత్మకశక్తి కూడా ఉండేది. బొమ్మలు గీయడం, పాట లు పాడటం చేసేవారు. బాల్య స్నేహితుడు, ఆ తర్వాతి కాలంలో రచయిత అయిన దోపాలపిచ్చయ్య శాస్త్రి సాహచర్యంలోఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. సాహిత్యం ఉన్నతవర్గాలకు పరిమిత మైన ఆ రోజుల్లోనే జాషువ తమ కులాల, జాతులపై జరిగిన దాడులను, వివక్షత లను జీవన సంఘర్షణలను, దుర్బరబతుకుల వేదనను అక్షర రూపంలో అసలు సిసలైన కవిత్వాన్ని సాహిత్యాన్ని సృష్టించారు. ఛాందసభావాల సాహిత్యాన్ని ఒక ఊపు ఊపి ఆధునిక భావాలకు, అట్టడుగు వర్గాల గాధలకు పట్టంకట్టి తెలుగు సాహితీకళామతల్లికి అక్షరనీరాజనం అర్పించాడు ఈ కవి.@శ్రీనివాస్@

👉తరతరాలుగా అగ్రవర్ణాలవారు దళితులపై దండయాత్ర చేస్తూ వారిని వెలిబాటలకు బలిచేస్తుంటే ఆయన చలించిపోయా రు. దళితులను నలుగురిలో కించపరుస్తూ, వంచించి అవమాన పరుస్తుంటే ఆ మహాకవి తట్టుకోలేకపోయారు. ఆవేదనాభరితమైన హృదయంతో పద్యమై, పద్యార్థమై గర్జించి తన దళిత ధిక్కార స్వర ప్రభంజనం వినిపించారు. అలాగే ఒక పక్క అంటరానితనం ఆర్థిక అసమానతలు, వర్ణ,కుల, వ్యవస్థలతో సమాజం విలయ తాండవం చేస్తుంటే ఇంకా దోపిడీ వర్గాలు అసమాన తలను పెంచి పోషిస్తుంటే వాట న్నింటిని చూసి చలించి ప్రతిమల పెండ్లి చేయుటకు వందలు, వేలు వ్యయింతురుకాని దుఃఖితమతులైన పేదల పకీరుల పాత్రలలో మెతుకు విదల్చరని నిలదీసిన సాంఘిక విప్లవ కారుడు. ఇలా మానవీయ దృక్పథానికి అద్దం పట్టే పద్యాలు లెక్క కు మిన్నగా రాశారు.అలాగే దళిత స్పృహతో అద్భుతమైన పద్యా లు రాశారు.@శ్రీనివాస్@

👉ఆయన రాసిన కావ్యాల్లో గబ్బిలం ఓ అత్యద్భు తమైన గొప్ప కావ్యంగా అభివర్ణించవచ్చు. అంటరానికులాన్ని, ఒక దళితుణ్ణి కథానాయకుడిగా చేసి గబ్బిలం కావ్యాన్ని రాసి సంచల నం సృష్టించారు. కథానాయకుడు తన గోడును కాశీనాధునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే ఈ కావ్యం కథాం శం.మహాపురుషులు జన్మించిన ఈ భారతావని కర్మభూమిలో దళితుడికి గుడిలోకి ప్రవేశం లేదు. కానీ గబ్బిలానికి ఉందంటూ, దళితుల దయనీయ పరిస్థితి గురించి చెప్తూ ఈ కావ్యంలో వర్ణిం చడం మనసున్న ఏ మనిషినైనా తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. ఈ కావ్యం ఆనాటి దళితుల జీవన విధానానికి అద్దం పడుతుంది.@శ్రీనివాస్@

👉ఈ కథలో కన్పించే దృశ్యాలన్ని కూడా ఆనాటి చారిత్రక, సామాజిక స్థితిగతుల్ని, ఎంతో హృదయవిదారకంగా మన కళ్లముందుంచారు. ఇంత గొప్ప కావ్యాలు రాస్తూకూడా ఆయన రెండు రకాలుగా వివ క్షకు గురయ్యారు. సమాజంలో ఒక పౌరునిగా వివక్షకు గురయ్యా రు. ఒక కవిగా ఆయనకుండేటటువంటి ఖ్యాతిని కానీ, ఆయన గొప్పతనాన్ని కానీ గుర్తించడానికి ఆనాటి సమకాలీన సాటికవ్ఞలు, పండితులు కూడా ఆయన్ని దరిచేరనివ్వలేదు.@శ్రీనివాస్@

👉ఈ విధంగా ఇటు కవిగా, అటు పౌరునిగా వ్యక్తిగా కూడా రెండు రకాల వివక్షల్ని ఎదురించి పోరాడి ఎన్నో అష్టకష్టాలుపడ్డారు. పేదరికంలో పుట్టి పేదల ఆకలిబాధలను చవిచూశారు. కనుకనే కళ్లకు కట్టినట్లుగా, కంటతడి పెట్టేవిధంగా రాయగలిగారు. జాషువా కావ్యాలన్నింటా సామాజిక చైతన్యం తొణికిసలాడుతుంది. ఆయన రాసిన మరో అందమైన అద్భుత కావ్యం కొత్తలోకం కావ్యం. ఈ కావ్యం ఎన్నో మరెన్నో సరికొత్త ఆలోచనల్ని రేకెత్తించింది.@శ్రీనివాస్@

👉ఒక కొత్త సాంఘిక వ్యవస్థకోసం ఆయనపడ్డ తపన, ఒక సరికొత్త మార్పుకోసం ఆయన కన్న కలలు, సాంఘిక, సామాజిక చైతన్యంకోసం ఆయన పడ్డ తపస్సు ఈ కొత్తలోకం కావ్యంలోని ప్రతిపద్యపాదంలో ఎంతో గొప్పగా స్పూరించింది. ఆయన రచనావ్యాసాంగంతోపాటు అనేక కీలక పదవ్ఞల్ని కూడా చేపట్టారు. రెండవ ప్రపంచ యుద్ధసమయంలో యుద్ధప్రచారకుడిగా పనిచేశారు. అలాగే మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేశారు.@శ్రీనివాస్@

👉ఇంకా 1964లో ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో సభ్యత్వం కూడా లభించింది. సాహిత్యంలో ఆయన చేసిన సేవలకు లెక్కకు మిన్నగా బిరుదుల్ని కైవసం చేసుకున్నారు. 1970లో ఆంధ్రవిశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. 1970లోనే భారతప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది. నవయుగ కవి చక్రవర్తి దళిత చైతన్య కవితాదీప్తి గుర్రంజాషువా 1971 జులై 24న గుంటూరులో పరమపదించారు.@శ్రీనివాస్@

💟💟💟💟💟💟💟💟💟💟