@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @
🌹✍️నేడు "గుర్రం జాషువా" గారి వర్ధంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు✍️🌹
👉గుర్రం జాషువా తెలుగు సాహితీ పూతోటలో విర బూసిన సాహితీ సుగంధ పుష్పం. ఆయన పేరు వింటేనే మల్లెలు పరిమళాల్ని వెదజల్లుతాయి. కవి త్వమే ఆయుధంగా మూఢాచారా లపై తిరగబడ్డ మహా కవి. సంఘ సంస్కరణ ఆయన కావ్యలక్షణం. వర్గసంఘర్షణ, ఆర్థిక వ్యత్యాసాలు, దోపిడీ వర్గాలపై తిరుగుబాటు చేసిన ఈ అభ్యుదయవాది 1895 సెప్టెంబర్ 28న వీరయ్య, లింగమ్మ దంపతులకు జన్మించారు. జాషువ వినుకొండలో ప్రైమరీ స్కూల్లో చేరారు. స్కూల్లో చేరిన ప్పటి నుండి అంటరానితనం జాషువాను పీడించింది. ఎన్నో అవ మానాలను, కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నత విద్యను విను కొండలోనే విజయవంతంగా పూర్తి చేశారు. 1910లో మరియమ్మ ను వివాహం చేసుకున్నారు. మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతంపై ఉద్యోగం చేశారు. ఆ తర్వాత రాజమండ్రి వెళ్లి 1915-1916లలో అక్కడ సినిమా ప్రచారకునిగా పనిచేశారు.@శ్రీనివాస్@
👉టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణలను చదువ్ఞతూపోవ డమే సినిమా ప్రచారకుని పని. ఆ తర్వాత గుంటూరులో లూథ రన్ చర్చి నడుపుతున్నప్పుడు ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపా ధ్యాయుడిగా పది సంవత్స రాలు పనిచేశారు. ఇలా ఉపాధ్యాయ వృత్తిని మొదలుపెట్టినప్పటి నుండి అంటే చిన్నతనం నుండి జాషువాకు సాహిత్యం, కవిత్వా లపై ఎక్కువ మక్కువ ఉండేది.@శ్రీనివాస్@
👉అలాగే సృజనాత్మకశక్తి కూడా ఉండేది. బొమ్మలు గీయడం, పాట లు పాడటం చేసేవారు. బాల్య స్నేహితుడు, ఆ తర్వాతి కాలంలో రచయిత అయిన దోపాలపిచ్చయ్య శాస్త్రి సాహచర్యంలోఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. సాహిత్యం ఉన్నతవర్గాలకు పరిమిత మైన ఆ రోజుల్లోనే జాషువ తమ కులాల, జాతులపై జరిగిన దాడులను, వివక్షత లను జీవన సంఘర్షణలను, దుర్బరబతుకుల వేదనను అక్షర రూపంలో అసలు సిసలైన కవిత్వాన్ని సాహిత్యాన్ని సృష్టించారు. ఛాందసభావాల సాహిత్యాన్ని ఒక ఊపు ఊపి ఆధునిక భావాలకు, అట్టడుగు వర్గాల గాధలకు పట్టంకట్టి తెలుగు సాహితీకళామతల్లికి అక్షరనీరాజనం అర్పించాడు ఈ కవి.@శ్రీనివాస్@
👉తరతరాలుగా అగ్రవర్ణాలవారు దళితులపై దండయాత్ర చేస్తూ వారిని వెలిబాటలకు బలిచేస్తుంటే ఆయన చలించిపోయా రు. దళితులను నలుగురిలో కించపరుస్తూ, వంచించి అవమాన పరుస్తుంటే ఆ మహాకవి తట్టుకోలేకపోయారు. ఆవేదనాభరితమైన హృదయంతో పద్యమై, పద్యార్థమై గర్జించి తన దళిత ధిక్కార స్వర ప్రభంజనం వినిపించారు. అలాగే ఒక పక్క అంటరానితనం ఆర్థిక అసమానతలు, వర్ణ,కుల, వ్యవస్థలతో సమాజం విలయ తాండవం చేస్తుంటే ఇంకా దోపిడీ వర్గాలు అసమాన తలను పెంచి పోషిస్తుంటే వాట న్నింటిని చూసి చలించి ప్రతిమల పెండ్లి చేయుటకు వందలు, వేలు వ్యయింతురుకాని దుఃఖితమతులైన పేదల పకీరుల పాత్రలలో మెతుకు విదల్చరని నిలదీసిన సాంఘిక విప్లవ కారుడు. ఇలా మానవీయ దృక్పథానికి అద్దం పట్టే పద్యాలు లెక్క కు మిన్నగా రాశారు.అలాగే దళిత స్పృహతో అద్భుతమైన పద్యా లు రాశారు.@శ్రీనివాస్@
👉ఆయన రాసిన కావ్యాల్లో గబ్బిలం ఓ అత్యద్భు తమైన గొప్ప కావ్యంగా అభివర్ణించవచ్చు. అంటరానికులాన్ని, ఒక దళితుణ్ణి కథానాయకుడిగా చేసి గబ్బిలం కావ్యాన్ని రాసి సంచల నం సృష్టించారు. కథానాయకుడు తన గోడును కాశీనాధునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే ఈ కావ్యం కథాం శం.మహాపురుషులు జన్మించిన ఈ భారతావని కర్మభూమిలో దళితుడికి గుడిలోకి ప్రవేశం లేదు. కానీ గబ్బిలానికి ఉందంటూ, దళితుల దయనీయ పరిస్థితి గురించి చెప్తూ ఈ కావ్యంలో వర్ణిం చడం మనసున్న ఏ మనిషినైనా తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. ఈ కావ్యం ఆనాటి దళితుల జీవన విధానానికి అద్దం పడుతుంది.@శ్రీనివాస్@
👉ఈ కథలో కన్పించే దృశ్యాలన్ని కూడా ఆనాటి చారిత్రక, సామాజిక స్థితిగతుల్ని, ఎంతో హృదయవిదారకంగా మన కళ్లముందుంచారు. ఇంత గొప్ప కావ్యాలు రాస్తూకూడా ఆయన రెండు రకాలుగా వివ క్షకు గురయ్యారు. సమాజంలో ఒక పౌరునిగా వివక్షకు గురయ్యా రు. ఒక కవిగా ఆయనకుండేటటువంటి ఖ్యాతిని కానీ, ఆయన గొప్పతనాన్ని కానీ గుర్తించడానికి ఆనాటి సమకాలీన సాటికవ్ఞలు, పండితులు కూడా ఆయన్ని దరిచేరనివ్వలేదు.@శ్రీనివాస్@
👉ఈ విధంగా ఇటు కవిగా, అటు పౌరునిగా వ్యక్తిగా కూడా రెండు రకాల వివక్షల్ని ఎదురించి పోరాడి ఎన్నో అష్టకష్టాలుపడ్డారు. పేదరికంలో పుట్టి పేదల ఆకలిబాధలను చవిచూశారు. కనుకనే కళ్లకు కట్టినట్లుగా, కంటతడి పెట్టేవిధంగా రాయగలిగారు. జాషువా కావ్యాలన్నింటా సామాజిక చైతన్యం తొణికిసలాడుతుంది. ఆయన రాసిన మరో అందమైన అద్భుత కావ్యం కొత్తలోకం కావ్యం. ఈ కావ్యం ఎన్నో మరెన్నో సరికొత్త ఆలోచనల్ని రేకెత్తించింది.@శ్రీనివాస్@
👉ఒక కొత్త సాంఘిక వ్యవస్థకోసం ఆయనపడ్డ తపన, ఒక సరికొత్త మార్పుకోసం ఆయన కన్న కలలు, సాంఘిక, సామాజిక చైతన్యంకోసం ఆయన పడ్డ తపస్సు ఈ కొత్తలోకం కావ్యంలోని ప్రతిపద్యపాదంలో ఎంతో గొప్పగా స్పూరించింది. ఆయన రచనావ్యాసాంగంతోపాటు అనేక కీలక పదవ్ఞల్ని కూడా చేపట్టారు. రెండవ ప్రపంచ యుద్ధసమయంలో యుద్ధప్రచారకుడిగా పనిచేశారు. అలాగే మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేశారు.@శ్రీనివాస్@
👉ఇంకా 1964లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సభ్యత్వం కూడా లభించింది. సాహిత్యంలో ఆయన చేసిన సేవలకు లెక్కకు మిన్నగా బిరుదుల్ని కైవసం చేసుకున్నారు. 1970లో ఆంధ్రవిశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. 1970లోనే భారతప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. నవయుగ కవి చక్రవర్తి దళిత చైతన్య కవితాదీప్తి గుర్రంజాషువా 1971 జులై 24న గుంటూరులో పరమపదించారు.@శ్రీనివాస్@
💟💟💟💟💟💟💟💟💟💟
No comments:
Post a Comment