Followers

14 January, 2020

జంధ్యాల

@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @

🌹🎞️🎥"నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం" అని చెప్పిన హాస్య బ్రహ్మ "జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి" గారి జయంతి నేడు.. ఆయన గురించి కొన్ని విషయాలు🎥🎞️🌹

👉జంధ్యాల పుట్టింది మకర సంక్రాంతి పర్వదినమైన జనవరి 14, 1951న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో. తండ్రి నారాయణమూర్తి ఆంధ్రరాష్ట్రానికి ‘బుష్‌’ రేడియోలకు పంపిణీదారుడుగా వుండేవారు. జంధ్యాల తల్లి సూర్యకాంతమ్మ. తల్లిదండ్రులకు జంధ్యాల ఒక్కడే సంతానం. చదువుసంధ్యలు విజయవాడ మాంటిస్సొరి హైస్కూలులో, ఆపైన ఎస్‌.ఆర్‌.ఆర్‌. ప్రభుత్వ కళాశాలలో పూర్తయ్యాయి. తండ్రి నుంచే జంధ్యాలకు కళ, సాంస్కృతిక రంగాలపట్ల అనురక్తి కలిగింది. స్కూలులోను, కాలేజీలోను నాటకాల్లో ప్రదర్శనకు ఉత్తమ నటుడిగా చాలా బహుమానాలు అందుకున్నాడు. అంతర్‌ కళాశాల నాటకపోటీలలో ప్రదర్శించిన ‘ప్రేమాయణం’ నాటికలో ప్రదర్శనకు ఉత్తమ నటుడిగా బహుమతి లభించింది. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే పత్రికలకు కథలు రాసి చిరు పారితోషికాలు కూడా అందుకున్న ఘనుడు. స్కూలు ఫైనల్‌ చదువుతుండగా ‘ఆత్మాహుతి’ అనే నాటకం రాశాడు. అదే జంధ్యాల తొలిరచన. రెండవ రచన ‘బహుకృత వేషం’. జంధ్యాల రాసిన’ ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌’ నాటిక బహుళ ప్రజాదరణ చూరగొంది. ఇతర భాషల్లోకి అనువదించబడి పదివేలకుపైగా ప్రదర్శనకు, పదిహేనుసార్లు పునర్ముద్రణకు నోచుకుంది. తరవాత రాసిన ‘జీవనజ్యోతి’, ‘ఆత్మాహుతి’, ‘డాక్టర్‌ సదాశివం’, ‘మరీచిక’, ‘మండోదరి మహిళామండలి’, ‘ఓ చీకటి రాత్రి’, ‘సంధ్యారాగంలో శంఖారావం’ నాటికలు ప్రేక్షకుల హర్షద్వానాలను అందుకున్నాయి. పరిషత్తు ప్రదర్శనల్లో బహుమతులు కొల్లగొట్టాయి. గుమ్మడి వెంకటేశ్వరరావు జంధ్యాల రచించి ప్రదర్శించిన ‘సంధ్యారాగంలో శంఖారావం’ నాటక ప్రదర్శన చూసి ప్రశంసిస్తూ, మద్రాసు కళాసాగర్‌ సంస్థ తరఫున ‘కలైవానర్‌ అరంగం’లో ప్రదర్శించే అవకాశాన్నికల్పించారు. ఆ నాటకానికి హాజరైన ప్రముఖ దర్శకనిర్మాత బి.ఎన్‌.రెడ్డి తను తీయబోయే సినిమా రచనకు ఆహ్వానించారు. అయితే దురదృష్టం కొద్దీ బి.ఎన్‌.రెడ్డి చనిపోవడంతో నిరుత్సాహపడుతున్న జంధ్యాలను దర్శకుడు కె.విశ్వనాథ్‌ భుజంతట్టి నైతిక మద్దతు ప్రకటించారు. అలా 1976లో లక్ష్మి ఫిలిం ఆర్ట్స్‌ సంస్థ అధిపతి హనుమాన్‌ ప్రసాద్‌ నిర్మించిన ‘దేవుడు చేసిన బొమ్మలు’ చిత్రానికి మాటలు సమకూర్చారు. రెండవ సినిమా ‘పెళ్లి కాని పెళ్లి’. నాటకాలు రాసిన అనుభవం, చిలకమర్తి, కందుకూరి, పానుగంటి, భమిడిపాటి వారు రచించిన హాస్యరచనలు చదవడం వలన అవి జంధ్యాల హాస్యం వైపు కాస్త మొగ్గుచూపేందుకు చాలా ఉపకరించాయి. కేవలం ఐదేళ్లలోనే దాదాపు ఎనభై సినిమాలకు సంభాషణలు రాసి రికార్డు సృష్టించాడు జంధ్యాల. 1976లో చింతా రామకృష్ణారెడ్డి గీతాకృష్ణా కంబైన్స్‌ పతాకంమీద ‘సిరిసిరిమువ్వ’ చిత్రాన్ని నిర్మించినప్పుడు, దర్శకుడు కె.విశ్వనాథ్‌ జంధ్యాలకు సంభాషణలు రాసే అవకాశాన్ని ఇచ్చారు. ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో రచయితగా జంధ్యాల స్థిరపడ్డారు. వేటూరి పాటలు, జంధ్యాల మాటలు కలబోసిన చిత్రాలు బాక్సాఫీసు హిట్లను ఎన్నింటినో తెలుగు ప్రేక్షకులకు పంచాయి. వాటిలో ముందు చెప్పుకోవలసిన సినిమా 1977 ఎన్టీఆర్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ చిత్రం ‘అడవిరాముడు’. ఆ చిత్రానికి జంధ్యాల సంభాషణలు రాసి తిరుగులేని రచయితగా పేరుతెచ్చుకున్నాడు. ఆ చిత్రం 32 కేంద్రాల్లో శతదినోత్సవం, నాలుగు కేంద్రాల్లో 365 రోజులు, 8 కేంద్రాల్లో రెండువందల రోజులు, 16 కేంద్రాల్లో 175 రోజులు ఆడి నాలుగు కోట్ల వసూళ్లు రాబట్టింది. 1978లో కృష్ణ సినిమా ‘బుర్రిపాలెం బుల్లోడు’కి, 1979లో ‘తాయారమ్మ బంగారయ్య’ హిట్‌ సినిమాలకు జంధ్యాల సంభాషణలు సమకూర్చారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ‘శంకరాభరణం’ (1979) చిత్రానికి జంధ్యాల రాసిన సంభాషణలు అద్భుతంగా అమరాయి. అలతి పదాలతో అనంతార్ధాలు పంచిన సంభాషణలు ఆ సినిమాలో కోకొల్లలు. విశ్వనాథ్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘సప్తపది’ చిత్రానికి కూడా జంధ్యాల పదునైన సంభాషణలు రాశారు. తరువాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘వేటగాడు’, ‘డ్రైవర్‌ రాముడు’, ‘రౌడీరాముడు-కొంటెకృష్ణుడు’, ‘అమరదీపం’, ‘భలేకృష్ణుడు’, ‘ఆఖరిపోరాటం’ ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘శుభోదయం’, ‘సీతామాలక్ష్మి’, ‘సాగరసంగమం’ ‘ఆపద్బాంధవుడు’, ‘స్వాతికిరణం’; సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘సొమ్మొకడిది-సోకొకడిది’, ‘ఆదిత్య369’, కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘పసివాడి ప్రాణం’, ‘విజేత’ వంటి విజయవంతమైన చిత్రాలకు మాటలు సమకూర్చారు. సినీ రచయితగా 1977-86 మధ్యకాలంలో జంధ్యాల అలా క్లాస్‌ని, మాస్‌ని అలరిస్తూ సుమారు రెండు వందల సినిమాలకు పైగా పనిచేశారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉నిర్మాత కానూరి రంజిత్‌ కుమార్‌ 1981లో నటనాలయ సంస్థ పేరుతో నిర్మించ తలపెట్టిన ‘ముద్దమందారం’ సినిమా కోసం జంధ్యాలకు దర్శకత్వం చేసే అవకాశాన్ని కలిపించారు. ఆ టీనేజి లవ్‌ స్టోరీకి జంధ్యాల తొలిసారి రచన, దర్శకత్వ బాధ్యలు నిర్వహించారు. రచయితగా మంచి పేరుతెచ్చుకుంటున్న సమయంలో దర్శకత్వం ఎంచుకోవడం జోడెడ్ల మీద సవారి అని స్నేహితులు వారించారు. అయితే దర్శకత్వం మీద మమకారం వున్న జంధ్యాల ముందుకు సాగేందుకే నిర్ణయించుకున్నారు. కొత్తవాళ్ళతో ప్రయోగానికి సిద్ధపడ్డారు. తను రాసిన ‘ఓ చీకటి రాత్రి’ నాటక ప్రదర్శన చూసి అందులో అద్భుత నటన ప్రదర్శించిన ప్రదీప్‌ కుమార్‌ని హీరోగా తీసుకున్నారు. హీరోయిన్‌గా మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన పూర్ణిమను ఎంపిక చేశారు. వైజాగ్‌ నావల్‌ యార్డులో పనిచేస్తున్న సుత్తి వేలును హాస్యనటుడిగా వెండితెరకు పరిచయం చేశారు జంధ్యాల. తన రంగస్థల గురువు విన్నకోట రామన్న పంతులుకి మంచి వేషం ఇచ్చారు. ఈ సినిమాలో జంధ్యాల డబ్బింగ్‌ కూడా చెప్పడం విశేషం. అధికభాగం సినిమా విశాఖపట్నం లోనే తయారైంది. రమేష్‌ నాయుడు సంగీతం అద్భుతంగా అమరిన ఈ చిత్రం 11 సెప్టెంబరున విడుదలై 25 కేంద్రాల్లో విజయవంతంగా ఆడి శతదినోత్సవం చేసుకుంది. అలా తొలి ప్రయత్నంలోనే జంధ్యాల దర్శకునిగా జయకేతనం ఎగురవేశాడు. నూతన నటవర్గంతో ప్రయోగాత్మకంగా లఘు బడ్జెట్‌ చిత్రాలు నిర్మించి మంచి ఫలితాలు రాబట్టిన దర్శకులలో జంధ్యాల పేరు ముందుంటుంది. రెండవ ప్రయత్నంగా జంధ్యాల దర్శకత్వం వహించిన చిత్రం ‘మల్లెపందిరి’. చల్లా వెంకట్రామయ్య నిర్మించిన ఈ చిత్రంలో విజ్జిబాబుని హీరోగా పరిచయం చేశారు. ‘తూర్పువెళ్లేరైలు’ ఫేమ్‌ జ్యోతి హీరోయిన్‌గా నటించగా ‘షేక్‌ మోజెస్‌’గా గాయకుడు బాలు, మరో పాత్రలో గేయ రచయిత వేటూరి అతిథి పాత్రలు పోషించారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉‘మల్లెపందిరి’ వచ్చిన నెల రోజుల గ్యాప్‌తో విడుదలైన జంధ్యాల చిత్రం ‘నాలుగు స్తంబాలాట’ సూపర్‌ హిట్‌గా నిలిచింది. నవతా కృష్ణంరాజు నిర్మించిన ఈ చిత్రంలో రెండు జంటలుగా నరేష్‌-పూర్ణిమ, ప్రదీప్‌-తులసి నటించారు. నరేష్‌కి హీరోగా ఇదే తొలి చిత్రం. ఇందులో వీరభద్రరావు, వేలు చేత ‘సుత్తి’ అనే పదప్రయోగం చేయించి వారిని ‘సుత్తిజంట’గా పాపులర్‌ చేసిన ఘనత జంధ్యాలది. సినిమాలో వీరి కామెడీ ట్రాక్‌ని రికార్డుగా విడుదల చేశారు. నరేష్‌కు బాలు డబ్బింగ్‌ చెప్పారు. ఇ.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రంతోనే జంధ్యాలవద్ద దర్శకత్వ శాఖలో చేరారు. ఈ సినిమా ఎనిమిది కేంద్రాల్లో వందరోజులు ఆడింది. హైదరాబాద్‌ దేవి థియేటర్లో 175రోజులు ఆడి శతదినోత్సవం జరుపుకున్న తొలిచిత్రం ఇదే. వరసగా మూడు ప్రేమకథా చిత్రాలను విజయవంతం చేసిన జంధ్యాల, నాలుగో ప్రయత్నంలో తన ట్రాక్‌ మార్చి ‘మతంకన్నా మానవత్వం మిన్న’ అనే సందేశమిచ్చే ‘నెలవంక’ (1983) చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రం ద్వారా రాజేష్, కిరణ్‌ అనే ఇద్దరు నటులను జంధ్యాల వెండితెరకు పరిచయం చేశారు. రాజేష్‌ పాతతరం హీరో అమరనాథ్‌ కుమారుడు. ఇందులో పాటలన్నీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మతో రాయించడం విశేషం. అయితే ఈ చిత్రం ఫ్లాపయింది. ముళ్లపూడి రమణ సృష్టించిన ‘రెండుజెళ్ళ సీత’ (1983) పేరుతో శ్రీభ్రమరాంబికా ఫిలిమ్స్‌ వారికి జంధ్యాల ఒక చిత్రం చేసిపెట్టారు. ఇందులో నరేష్, ప్రదీప్, రాజేష్, శుభాకర్‌ నలుగు కుర్రాళ్లు ప్రధాన పాత్రలు పోషించారు. సీనియర్‌ నటి పుష్పలత కూతురు మహాలక్ష్మిని హీరోయిన్‌గా తొలిసారి పరిచయం చేశారు. ఈ సినిమాలో కథానాయికగా నటించాలని విజయశాంతి, భానుప్రియ, శోభన సెలక్షన్లకు వచ్చారు. కానీ అవకాశం రాలేదు. ఇందులో హాస్యనటిగా నటించిన శ్రీలక్ష్మి పాతతరం నాయకుడు అమరనాథ్‌ కూతురే. సినిమా బాగా ఆడి శతదినోత్సవం జరుపుకుంది. జంధ్యాల అక్కినేనితో ‘అమరజీవి’ అనే ఒకేఒక చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా విజయానికి దరిచేరలేదు. తరువాత చంద్రమోహన్‌-రాధిక జంటగా ‘మూడుముళ్ళు’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈనాడు పత్రికాధినేత రామోజీరావు జంధ్యాల దర్శకత్వంలో ‘శ్రీవారికి ప్రేమలేఖ’ చిత్రాన్ని నిర్మించారు. వారి సంస్థ వెలువరించే ‘చతుర’లో వచ్చిన పొత్తూరి విజయలక్ష్మి నవల ‘ప్రేమలేఖ’ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో నరేష్‌-పూర్ణిమ జంటగా నటించారు. 1984లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘ఆనందభైరవి’ చిత్రాన్ని మరో ‘శంకరాభరణం’గా భావించవచ్చు. పరకాయప్రవేశ నేపథ్యంలో రూపుదిద్దుకున్న మరో జంధ్యాల సినిమా ‘రావూగోపాల్రావూ’. 1985లో నరేష్‌-పూర్ణిమ జంటగా జంధ్యాల ‘పుత్తడిబొమ్మ’ నిర్మించారు. కార్టూనిస్టు జయదేవ్‌ సీరీస్‌ ‘బాబాయ్‌-అబ్బాయ్‌’ ఆధారంగా సుత్తి వీరభద్రరావు-బాలకృష్ణలతో జంధ్యాల మరో చిత్రాన్ని సృష్టించారు. మరో జంధ్యాల చిత్రం ‘శ్రీవారి శోభనం’లో నరేష్‌కు జంటగా అనితారెడ్డి నటించింది. ఆ తరువాత భానుప్రియ-నరేష్‌ జంటగా జంధ్యాల దర్శకత్వం నిర్వహించిన చిత్రం ‘మొగుడూ-పెళ్ళాలూ’. ‘బామ్మగారి మనవరాలు’ చిత్రంతో భానుమతిని బామ్మపాత్రలో నటింపజేసిన జంధ్యాల విజయవంతమయ్యారు. ఇక రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్‌లతో నిర్మించిన ఓ తమాషా ప్రేమకథ ‘రెండురెళ్ళు ఆరు’ చిత్రం బాగా ఆడి శతదినోత్సవం జరుపుకుంది. యువచిత్ర నిర్మాత మురారి జంధ్యాల దర్శకత్వంలో ‘సీతారామకల్యాణం’ (1988) చిత్రాన్ని బాలకృష్ణ హీరోగా నిర్మించారు. ఈ చిత్రం 14కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. యాక్షన్‌ హీరోగా ముద్రపడిన చిరంజీవిని విభిన్న కోణంలో చూపిస్తూ ఆయనచేత చార్లీ చాప్లిన్‌ను పోలిన హాస్యపాత్రను పోషింపజేసిన సినిమా ‘చంటబ్బాయ్‌’.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉అమెరికా ప్రవాసాంధ్రుల కోరిక మేరకు వారితో ఒక సినిమా తీసేందుకు జంధ్యాల ప్లాన్‌ చేశారు. అదే ‘పడమటి సంధ్యారాగం’. తెలుగు తెరమీద హాస్యానికి మహారాజయోగం పట్టించిన రామానాయుడు-జంధ్యాలల సినిమా ‘అహ నా పెళ్ళంట’. రాజేంద్రప్రసాద్‌ హీరోగా అద్భుత హాస్యాన్ని అందించాడు. జంధ్యాల తరువాతి కాలంలో నిర్మించిన ‘చిన్నికృష్ణుడు’ చిత్రానికి బాలీవుడ్‌ ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌.డి.బర్మన్‌ సంగీతం సమకూర్చడం విశేషం. రాజేంద్రప్రసాద్‌తో నిర్మించిన ‘వివాహ భోజనంబు’లో బాలు పోలీసు ఇనస్పెక్టర్‌గా ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. ‘నీకు నాకు పెళ్ళంట’, ‘చూపులు కలిసిన శుభవేళ’, ‘హై హై నాయకా’, ’జయమ్ము నిశ్చయమ్మురా’, ‘లేడీస్‌ స్పెషల్‌’, ‘బావా బావా పన్నీరు’, ‘బాబాయ్‌ హోటల్‌’, ‘ప్రేమా జిందాబాద్‌’ వంటి జంధ్యాల సినిమాలు బాగానే ఆడాయి. మొత్తంమీద జంధ్యాల 350 సినిమాలకు రచన చేసి 44 సినిమాలకు దర్శకత్వం వహించారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

💟💟💟💟💟💟💟💟💟💟

సి డి దేశ్ ముఖ్

@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @

🌹జనవరి 14, "సి.డి.దేశ్‌ముఖ్" గారి జయంతి సందర్భంగా  కొన్ని విషయాలు🌹

👉సి.డి.దేశ్‌ముఖ్ (జనవరి 14, 1896 - అక్టోబరు 2, 1982) పూర్తి పేరు చింతామణి ద్వారకానాథ్ దేశ్‌ముఖ్ (Chintaman Dwarakanath Deshmukh). వీరు భారతీయ రిజర్వ్ బాంక్ మూడవ గవర్నర్ మరియు స్వతంత్ర భారత దేశపు తొలి రిజర్వ్ బాంక్ గవర్నర్.ఇతడు 1943, ఆగష్టు 11 నుంచి 1949, జూన్ 30 వరకు ఈ పదవిని నిర్వహించాడు. ఆ తర్వాత దేశ్‌మూఖ్ భారత దేశానికి ఆర్థిక మంత్రిగా నియమితులైనాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

🍁జననం🍁

👉1896, జనవరి 14 న జన్మించాడు. 1920లో రోసినా ఆర్థర్ విల్కాక్స్ అనే ఆంగ్ల వనితను వివాహమాడాడు. 1949లో తొలి భార్య మరణించింది. వీరి కుమార్తె ప్రిమ్‌రోజ్ ఇంగ్లాండులో నివసిస్తుంది.ఆ తరువాత 1953లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలైన దుర్గాబాయి దేశ్‌ముఖ్ను వివాహం చేసుకున్నాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉ఇండియన్ సివిల్ సర్వీస్ సభ్యుడైన దేశ్‌ముఖ్ కు 1939 నుంచే రిజర్వ్ బ్యాంక్ తో సంబంధం ఉంది. 1941లో రిజర్వ్ బ్యాంక్ డిప్యూటి గవర్నర్ గా నియమించబడ్డాడు. August, 1943. ఆ తర్వాత జేమ్స్ టేలర్ నుంచి 3 వ గవర్నర్ గా బాధ్యతలు పొందినాడు. దేశ్‌ముఖ్ గవర్నర్ గా ఉన్న సమయంలో ప్రపంచంలో ముఖ్యమైన ఆర్థిక పరిణామాలు సంభవించాయి. జూలై 1944లో జరిగిన బ్రెట్టన్ వుడ్స్ సమావేశంలో అతడు కూడా భారత దేశం తరఫునన పాల్గొన్నాడు. ఈ సమావేశమే అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (International Monetary Fund-IMF) మరియు ప్రపంచ బ్యాంకు (International Bank for Reconstruction and Development-IBRD) ఏర్పడడానికి కారణమైంది. ఈ రెండు సంస్థల లోనూ దేశ్‌ముఖ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ గా పదేళ్ళ పాటు పనిచేశాడు. 1950లో పారిస్లో జరిగిన ఈ రెండు సంస్థల వార్షిక సంయుక్త సమావేశంలో ఇతడు చైర్మెన్ గా వ్యవహరించాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

🍁అవార్డులు🍁

👉1952లో దేశ్‌ముఖ్ విద్యనభ్యసించిన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయపు జేసస్ కళాశాల నుంచి గౌరవ ఫెలోగా ఎన్నికయ్యడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉1959లో ప్రభుత్వ సర్వీసు రంగంలో రామన్ మెగ్సేసే అవార్డును పిలిప్పీన్స్కు చెందిన జోస్ అగ్విలార్ తో కల్సి సంయుక్తంగా పొందినాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉1975లో భారత ప్రభుత్వం చే పద్మ విభూషణ పురస్కారం పొందినాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

🍁మరణం🍁

👉1982, అక్టోబరు 2న మరణించారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

💟💟💟💟💟💟💟💟💟💟

న్యాపతి సుబ్బారావు

@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @

🌹జనవరి 14, "ఆంధ్రభీష్మగా పేరొందిన న్యాపతి సుబ్బారావు పంతులు" గారి జయంతి సందర్భంగా.... 🌹

👉ఆంధ్రభీష్మగా పేరొందిన న్యాపతి సుబ్బారావు పంతులు (జనవరి 14, 1856 - జనవరి 15, 1941) స్వాతంత్య్ర సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త, పాత్రికేయుడు మరియు రాజకీయ నాయకునిగా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశీలి.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

🍁బాల్యం, విద్యాభ్యాసం🍁

👉సుబ్బారావు 1856వ సంవత్సరం జనవరి 14 వ తేదీ మకర సంక్రాంతి రోజున నెల్లూరులో రాఘవరావు, రంగమ్మ దంపతులకు జన్మించాడు. ఆ తరువాత కుటుంబం రాజమండ్రికి మారింది. బాల్యం నుండే సుబ్బరావు విషయ పరిజ్ఞాన సముపార్జన పట్ల అమిత జిజ్ఞాస కలిగి ఉండి పేదరికం కారణంగా వీధిలాంతర్ల మసక వెలుతులో చదువు కొనసాగించాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉మెట్రిక్యులేషన్‌ పాస్‌ అయ్యి అనంతరం మద్రాసు క్రైస్తవ కళాశాలలో చేరి స్కాలర్‌షిప్‌ సహాయంతో చదువుకుని 1876లో బిఎ డిగ్రీ పొందాడు. అనంతరం అధ్యాపకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. బోధనా వృత్తిలో కొనసాగుతూనే న్యాయవాద విద్యను అభ్యసించి 1879లో లా పట్టాను పొందాడు. ఉపాధ్యాయునిగా పనిచేస్తూ న్యాయవాద పట్టాను పొందటం అప్పట్లో అరుదైన విషయం. ఈ ఖ్యాతిని సాధించిన దక్షిణ భారతదేశంలోని అతి కొద్దిమందిలో ఒకరిగా కోస్తా జిల్లాల్లో తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉న్యాయవిద్యార్థిగా ఉండగానే 22 ఏళ్ళ ప్రాయంలో ఆయన ట్రిప్లికేన్‌ సిక్స్‌గా పిలువబడే నాటి సాహిత్య సంఘం సభ్యులు మరో ఐదుగురు సభ్యుల మిత్ర బృందంతో కలసి, జాతీయోద్యమానికి సహకరించే ఉదాత్త లక్ష్యంతో, ది హిందూ జాతీయ ఆంగ్ల దినపత్రికను స్థాపించాడు. అప్పట్లో భారతదేశంలో ప్రచుతరిమయ్యే ఆంగ్ల పత్రికలన్నీ బ్రిటీష్‌ ప్రభుత్వం కనుసన్నలలోనే ఉండేవి.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

🍁రాజమండ్రిలో 🍁

👉ఉమ్మడి మద్రాసు రాష్టంలో సుబ్బారావు గౌరవ న్యాయమూర్తిగాను, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేశాడు. 1880లో న్యాపతి సుబ్బారావు మద్రాసు నుంచి రాజమండ్రి తిరిగివచ్చి అక్కడే స్థిరపడ్డాడు. మరో 9 మంది న్యాయవాదులతో కలిసి రాజమండ్రి బార్ అసోషియేషన్ స్థాపించాడు. రాజమండ్రిలో సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగంతో సన్నిహితంగా మెలగేవాడు. వితంతు పునర్వివాహాలు జరిపించడంలో వీరేశలింగానికి సుబ్బారావు పంతులు ఎంతగానో సహకరించాడు. 1881లో స్థాపితమైన హితకారిణి సమాజం యొక్క మొదటి కార్యదర్శిగా నియమించబడి నిర్వహణలో, కార్యకలాపాల విస్తరణలో విలువైన సేవలందించాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉1885లో రాజమండ్రి పురపాలకసంఘానికి తొలి అనధికార ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. 1888 వరకూ ఆయన ఆ పదవిలో కొనసాగారు. *ఆయన హయాంలోనే రాజమండ్రి ప్రజలకు తొలిసారి కుళాయి కనెక్షన్లు మంజూరు చేశారు. 1893లో ఆయన మద్రాసు ఇంపీరియల్‌ లెజిస్టేటివ్‌ కౌన్సిల్‌కు సభ్యునిగా ఎన్నికై సర్కారు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ పదవిలో ఆయన వరుసగా మూడు పర్యాయాలు ఎన్నికై 1899 వరకు కొనసాగాడు. 1896లో ఆయన రాజమండ్రిలోని టౌన్‌ హాల్‌ ట్రస్టుబోర్డు కమిటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. కలకత్తాలోని టౌన్‌ హాలు తర్వాత దేశంలో అంతటి ప్రాముఖ్యత రాజమండ్రి టౌన్‌ హాల్‌కు ఉంది. దీనిని కందుకూరి వీరేశలింగం పంతులు స్థాపించటం వెనుక న్యాపతి వారి సహకారం ఎంతో ఉంది.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉సుబ్బారావు పంతులు రాజమండ్రి ఎలక్ట్రిక్‌ సప్లై కార్పొరేషన్‌ను స్థాపించి, విద్యుదుత్పాదన చేయడమే కాక తొలిసారిగా రాజమండ్రికి ఆ విద్యుత్‌ను సరఫరా చేసి వెలుగులు నింపాడు. *1893లో ఆయన రాజమండ్రిలో చింతామణి పత్రికను పునరుద్ధరించి ప్రజలకు ఆందుబాటులోకి తెచ్చాడు. ఈ పత్రికకు కందుకూరి వీరేశలింగం పంతులు ఎడిటర్‌గా వ్యవహరించాడు. రచయితల్ని ఆర్థికంగా ప్రోత్సహించటం లక్ష్యంగా సుబ్బారావు పంతులు నవలారచన అంశంగా వివిధ పోటీలు నిర్వహించేవాడు. చిలకమర్తి లక్ష్మీనరసింహం రచనా వ్యాసంగానికి సుబ్బారావు నైతికంగా, ఆర్థికంగా ఎంతో సహకరించాడు. అదేవిధంగా హరికథా పితామహ ఆదిభట్ల నారాయణదాసును రాజమండ్రి, పరిసర ప్రాంతాలకు పరిచయం చేసినది కూడా ఈయనే.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉1922 ప్రాంతంలో రాజమండ్రిలో ఆంధ్ర చారిత్రక పరిశోధనా సంస్థ (ఇప్పుడు రాళ్ళబండి సుబ్బారావు పురావస్తు ప్రదర్శనశాలగా ఉన్నది) ఏర్పాటును న్యాపతి సుబ్బారావు పంతులు ఎంతగానో ప్రోత్సహించాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉1897, ఫిబ్రవరి11న స్వామి వివేకానంద అంతర్జాతీయ మతాల సమావేశంలో ప్రసంగించి భారతదేశం తిరిగివస్తున్న సందర్భంలో ట్రిప్లికేన్ సిక్స్ మిత్రబృందం ఆయన్ను ఆహ్వానించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పురజనులు హాజరైన ఆ సమావేశంలో వివేకానందుని ఆహ్వాన సంఘానికి న్యాపతి సుబ్బారావును అధ్యక్షునిగా నియమించారు. వివేకానందుడు మద్రాసు రేవులో దిగగానే పూలమాల వేసి ఆహ్వానించిన తొలివ్యక్తి సుబ్బారావే. ఆ మరుసటి రోజు విక్టోరియా హాల్లో వివేకానందునికి ఆహ్వాన సభ ఏర్పాటు చేశారు.ఫిబ్రవరి14న మెరీనా బీచ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వివేకానందునితో పాటు సుబ్బారావు పంతులు వేదికను అలంకరించాడు. అలా ప్రారంభమైన వీరి స్నేహం సుబ్బారావుపై గాఢమైన ప్రభావాన్ని వేసింది. 1903లో వివేకానందుని స్ఫూర్తితో, సుబ్బారావు రాజమండ్రిలో భగవద్గీత మరియు సనాతన హిందూధర్మ ప్రచారానికై, హిందూ సమాజం అనే సంస్థను స్థాపించాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉1898 నుంచి 1917 వరకూ భారత జాతీయ కాంగ్రెస్‌లో ఆయన కీలకమైన భూమికను పోషించాడు. 1907లో వందేమాతర ఉద్యమ సందర్భంగా బిపిన్ చంద్రపాల్‌ను రాజమండ్రి ఆహ్వానించి అక్కడ ఉపన్యాసాలు ఇప్పించాడు. విజయవాడలో 1914 ఏప్రిల్‌ 11వ తేదీన జరిగిన రెండవ ఆంధ్ర మహాసభకు ఆయన అధ్యక్షత వహిస్తూ, మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్ర విభజన కోసం చారిత్రాత్మకమైన పిలుపునిచ్చాడు. 1918 జనవరి 1వ తేదీన సుబ్బారావు పంతులు డిమాండ్‌ మేరకు ఆంధ్రప్రాంతానికి ప్రత్యేక ప్రాంతీయ కాంగ్రెస్‌ కౌన్సిల్‌ను అధిష్టానం ఏర్పాటు చేసింది. ఈ మండలికి న్యాపతి సుబ్బారావు పంతులు అధ్యక్షుడయ్యాడు. అంతేగాక ఆయన అఖిలభారత కాంగ్రేసు కమిటీ ప్రధాన కార్యదర్శిగా నాలుగు పర్యాయాలు ఎన్నికై సేవలందించాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉సుబ్బారావు పంతులు 1941, జనవరి 15వ తేదీన మరణించాడు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

💟💟💟💟💟💟💟💟💟💟


16 November, 2019

AP: SA-1 ENGLISH QP AND KEY.. 2019-20

🌻🌹SA-1 ENGLISH QP AND KEY... 2019-20🌹🌻

For 6th class to 10th class QP.. CLICK HERE..

For Key.. CLICK HERE..

For 9th P-2 and 10th P-2 Key.. CLICK HERE..

@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @