Followers

24 October, 2019

LAKSHMI SEHGAL



@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @

🌹నేడు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు "లక్ష్మీ సెహగల్" గారి జయంతి.. ఆమె గురించి కొన్ని విషయాలు🌹

👉కెప్టెన్ లక్ష్మీ సెహగల్ (జ: అక్టోబర్ 24, 1914) ప్రముఖ సంఘసేవకురాలు మరియు రాజ్యసభ సభ్యురాలు. ఈమె భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన తొలి మహిళ.ఈమె తండ్రి స్వామినాథన్ మద్రాసులో ప్రముఖ న్యాయవాది. తల్లి ఎ.వి.అమ్ము కుట్టి సామాజిక సేవా కార్యకర్త. చిన్నతనంలోనే సెహగల్ విదేశీ వస్తు బహిష్కరణ, మధ్యనిషేధం వంటి జాతీయ పోరాటాలలో పాల్గొన్నారు.1938 లో మద్రాసు వైద్య కళాశాలలో ఎం.బి., బి.ఎస్. గైనకాలజీ పూర్తయిన తరువాత 1940లో సింగపూర్ వెళ్ళి, అక్కడ భారతీయ నిరుపేదల వాడలో వైద్యశాల స్థాపించి, స్థానికంగా ఉన్న భారతీయ కార్మికులకు సేవలందించారు. అక్కడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రసంగాలకు ప్రభావితురాలై స్వాతంత్ర్యోద్యమంలో ‘ఆజాద్ హింద్ ఫౌజ్ ’ మహిళాదళాల్లో చేరి, క్యాప్టెన్ హోదా పొంది, డాక్టర్‌గా వైద్యసేవలు కూడా అందచేశారు.ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆధ్వర్యంలోని ఝాన్సీ రెజిమెంట్ కు ప్రాతినిధ్యం వహించారు.లక్ష్మీ సెహగల్ 1947లో లాహోర్ కు చెందిన కర్నల్ ప్రేమ్ కుమార్ సెహగల్ ను లాహోర్‌లో వివాహం చేసుకొని కాన్పూర్ లో స్థిరపడి కాన్పూర్ ప్రజలకు వైద్యసేవలందించారు.స్వాతంత్ర్యానంతరం ఆల్ ఇండియా డెమొక్రటిక్ ఉమెన్స్ అసోషియేషన్ (ఐద్వా) ఉపాధ్యక్షురాలిగా వివిధ స్థాయిలలో సమాజ సేవకు అంకితమయ్యారు.1971లో, సీపీఎం తరఫున లక్ష్మీ సెహ్‌గల్ రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 1998లో ఈమెకు పద్మ విభూషణ్ పురస్కారం ప్రదానం చేయబడింది.2002లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమె వామపక్షాల మద్దతుతో బరిలోకి దిగారు. (ఆ ఎన్నికల్లో అబ్దుల్ కలామ్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.) 97 సంవత్సరాల వయసులో లక్ష్మీ సెహ్‌గల్ 2012, జూలై 23న కాన్పూర్‌లో మరణించారు.

💟💟💟💟💟💟💟💟💟💟

UNO FORMATION DAY..


@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @

🌏నేడు "ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం" సందర్భంగా కొన్ని విషయాలు🌏

👉అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందు కు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీ య సంస్థ.

👉మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి(లీగ్ ఆఫ్ నేషన్స్)  రెండవ ప్రపంచ యుద్ధాన్ని  నివారిం చుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నా యంగా  1945లో అక్టోబర్ 24న, ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉ప్రస్తుతం193 దేశాలు ఐక్యరాజ్య సమితి లో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి.

👉సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్నిదేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు.అవి: అమెరికా,రష్యా, బ్రిటన్, చైనా మరియుఫ్రాన్స్. ప్రధాన కార్యాలయం  న్యూయార్క్  నగరంలో ఉంది.దీని ప్రస్తుత ప్రధానకార్యదర్శి  ఆంటానియో గుట్టెర్స్. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన అక్టోబరు 24వ తేదీని ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవం గా పాటిస్తారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

🍁సమితి ఆవిర్భావం🍁

👉రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే 1941 ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు థియోడార్ రూజ్‌వెల్ట్ మరియు బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ అట్లాంటిక్ సముద్రంలో ఒకఓడలో సమావేశమై కుదుర్చు కొన్న ఒప్పందాన్ని అట్లాంటిక్ ఛార్టర్అంటారు.

👉ప్రాదేశిక సమగ్రత కాపాడడం, యుద్ధ భయాన్ని తొలగించడం,శాంతిని నెలకొల్పడం,  నిరాయుధీకరణ వంటి ఎనిమిది అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ ఒప్పందమే తరువాత ఐక్య రాజ్య సమితి సిద్ధాంతాలకు మౌలిక సూత్రాలుగా గుర్తింపు పొందినది.

👉తర్వాత 1944లో వాషింగ్టన్ లోని డంబార్టన్ ఓక్స్ వద్ద జరిగిన సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా ప్రతినిధులు ఐ.రా.స. ప్రకటన పత్రం ముసాయిదాను తయారు చేశారు.

👉1945 ఫిబ్రవరిలో యాల్టా సమావేశంలో అమెరికా, బ్రిటన్,రష్యా నేతలు ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం ఒక అంతర్జాతీయ సంస్థను స్థాపించాలని తీర్మానం చేశారు.

👉శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో1945 ఏప్రిల్ 25 నుండి జూన్26 వరకు జరిగిన అంతర్జాతీయ సమావేశంలో 51 దేశాల ప్రతినిధులు పాల్గొని ఐక్యరాజ్యసమితి ఛార్టర్‌పై సంతకాలు చేశారు. దీనితో 1945 అక్టోబరు 24న న్యూయార్క్  నగరంలో 'ఐక్య రాజ్య సమితి 'లాంఛనంగా ప్రారంభమైంది.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

🍁సమితి ఆశయాలు:🍁

👉యుద్ధాలు జరగకుండా చూడటం..

👉అంతర్జాతీయ తగాదాలను శాంతియుతం  గా  పరిష్కరించడం..

👉దేశాల మధ్య స్నేహసంబంధాలను పెంపొందించడం..

👉అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించేటట్లు చేయడం..

👉సాంఘిక అభివృద్ధి సాధించి..
మానవ జీవితాలను సుఖమయం చేయడం.

🍁సమితి ప్రధాన అంగాలు:🍁

🍁ఐక్యరాజ్యసమితికి 6 ప్రధానాంగాలు ఉన్నాయి🍁

🍁1.సర్వ ప్రతినిధి సభ🍁
🍁సాధారణ సభ సమావేశం:🍁

👉ఈ సభలో సభ్యదేశాలన్నింటికీ ప్రాతి నిధ్యం ఉంటుంది. ప్రతి దేశానికి సమానంగా ఒక్క ఓటు ఉంటుంది. సమావేశా లకు ప్రతి సభ్యదేశం గరిష్ఠంగా 5 గురు సభ్యులను పంపవచ్చు. ఈ సభ సం"నికి ఒక పర్యాయం, సాధారణం గా సెప్టెంబరు మాసంలో, సమవేశమౌతుంది. సమావేశానికి అధ్యక్షుడిగా సభ్యదేశాలు ఎన్నిక చేస్తాయి. కొత్త సభ్యదేశాలకు ప్రవేశం కల్పించడానికి, భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశాలను ఎన్నిక చేయుటలో ఈ సభకే అధికారముంది. సమితి ఆశయాలకు, లక్ష్యాలకు వ్యతిరేకంగా వ్యవహరించే సభ్యదేశాలను తొలగించే అధికారం కూడా ఈ సభకు ఉంది.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉అన్ని రంగాలలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందిం చడం దీని కర్తవ్యం. ఈ సభ మూడింట రెండు వంతులు (2/3) మెజారిటీ తో నిర్ణయాలు చేస్తుంది.

🍁2.భద్రతా మండలి🍁

👉సమితి ప్రారంభమయ్యేనాటికి ఇందులో సభ్య దేశాల సంఖ్య 11. ప్రస్తుతం 15 సభ్యదేశాలు ఉన్నాయి. అందులో 5 శాశ్వత సభ్యదేశాలు కాగా 10 రెండేళ్ళ కాలవ్యవధి కొరకు ఎన్నిక కాబడు తాత్కాలిక సభ్యదేశాలు.

👉అమెరికా, రష్యా, ఇంగ్లాండు, చైనా, ఫ్రాన్సులుఇందులో శాశ్వత సభ్యదేశాలు. ఈ శాశ్వత సభ్యదేశాలకు వీటో అధికారం కూడా ఉంది. సమితి ప్రారంభమైనప్పటి నుంచి ఇందులో ప్రధానమైన రెండు మార్పులు చేసారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉ప్రారంభంలో 6 తాత్కాలిక సభ్యదేశాలుం డగా దాని సంఖ్యను 10 కి పెంచారు. వీరిలో ఆసియా-ఆఫ్రికా దేశాలనుండి ఐదుగురు, లాటిన్ అమెరికా దేశాలనుండి ఇద్దరు, పశ్చిమ ఐరోపా నుండి ఇద్దరు, తూర్పు ఐరోపా‌నుండి ఒక్కరు ఎన్నికవుతుంటారు. తాత్కాలిక సభ్యదేశాలను సాధారణ సభ ఎన్నిక చేస్తుంది. ఏ దేశం కూడా వరుసగా రెండు పర్యాయాలు ఎన్నిక కారాదు.

🍁3.సచివాలయం🍁

👉ఇది ఐ.రా.స. వ్యవహారాలు నిర్వహించే కార్యనిర్వాహక విభాగం. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. ఇందులో పది వేలకు పైగా ఉద్యోగు లు పనిచేస్తారు. సచివాలయానికి ప్రధానాధికారిని సెక్రటరీ జనరల్ అంటారు. ఐ.రా.స.కీ, దాని వివిధ విభాగాలకు, అనుబంధ సంస్థలకు అవసరమైన సమాచారము అధ్యయనం, సదుపాయాలు వంటి విషయాలు సచివాల యం అధ్వర్యంలో నిర్వహింపబడుతాయి.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

🍁4.ధర్మ కర్తృత్వ మండలి🍁

👉కొన్ని పాశ్చాత్యదేశాల వలస పాలన క్రింద కొనసాగిన భూభాగాల ప్రయోజ నాలను కాపాడడం ఈ మండలి లక్ష్యం. ఇక్కడి ప్రజలను స్వీయ ప్రతిపత్తి కి లేదా స్వయంపాల నకు లేదా స్వాతంత్ర్యానికి సిద్ధం చేయడం ఈ మండలి బాధ్యత.

👉ఇది సంవత్సరానికి రెండు సార్లు సమావేశ మవుతుంది. ఇందులో 3రకాల సభ్యత్వాలు ఉన్నాయి.

🍁 5.ఆర్థిక, సాంఘిక మండలి🍁

👉ఇది సాధారణ సభ అధ్వర్యంలో పని చేస్తుంది. ఇందులో 54 మంది సభ్యులుంటారు. ఈ మండలి ఏటా రెండుసార్లు సమావేశమవు తుంది. ప్రజల జీవన స్థాయిని మెరుగు పరచ డం, విద్య, సాంస్కృతిక, ఆరోగ్య రంగాలలో అంతర్జాతీయ సహకారానికి కృషి చేయడం, మానవ హక్కులను సమర్ధించడం వంటివి ఈ మండలి ఆశయాలు.

🍁 6.అంతర్జాతీయ న్యాయస్థానం🍁

👉అంతర్జాతీయ న్యాయస్థానం (సాధారణంగా "ప్రపంచన్యాయస్థానం"గా పిలువబడుతుంది) ఐక్యరాజ్యసమితి యొక్క ప్రాథమిక తీర్పుల ను ప్రకటించే అంగము.

👉దీని కేంద్రం నెదర్లాండ్ లోని హేగ్ నగరంలోగల, శాంతి సౌధంలో యున్నది. దీని ప్రధాన కార్యక్రమం, సభ్యదేశాల ద్వారా సమర్పించ బడిన "న్యాయపర వాదనలు" ఆలకించడం మరియు తీర్పు చెప్పడం. అంతర్జాతీయ న్యాయస్థానం మరియు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు రెండూ వేరు వేరు సంస్థలు. వీటి రెండిటికీ ప్రపంచ పరిధి ఉంది.

👉1945లో ఐక్యరాజ్యసమితి చార్టర్  ఆధారంగా స్థాపించబడింది. 1946 నుండి పనిచేయడం ప్రారంభించింది. ఇది పర్మనెంటు కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్ యొక్క వారసురాలు.

🍁ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు:🍁

👉ప్రత్యేక ఒప్పందాల ద్వారా ఏర్పడిన ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్యా, వైద్య రంగాలలో పనిచేస్తుంటాయి. ఐక్య రాజ్య సమితి అంగాలలో ఒకటైన "ఆర్ధిక, సామాజిక మండలి" ఈ అనుబంధ సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తుంది.

🍁ఐక్యరాజ్యసమితివిద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ- యునెస్కో (UNESCO)🍁

👉ఈ సంస్థను 1946 నవంబరు 4న స్థాపిం చారు. దీని ప్రధాన కార్యాలయం పారిస్ లో  ఉంది. విద్య, విజ్ఞానం, సంస్కృతి రంగాలలో అంతర్జాతీయ సహకారానికి, ప్రగతికి, శాంతియుత సంబంధాలకు ఈ సంస్థ కృషి చేస్తుంది. ప్రస్తుతం యునెస్కోలో 192 దేశాలకు సభ్యత్వం ఉంది.

🍁ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి - యునిసెఫ్  (UNICEF )🍁

👉1946 డిసెంబరు11న ఈ సంస్థ ఏర్పా టైంది. ప్రధాన కార్యాలయం న్యూయార్కు నగరంలో ఉంది. ప్రస్తుతం దీని పేరులో "అంతర్జాతీయ ", "అత్యవసర " అనే పేర్లను తొలగించి 'ఐక్య రాజ్య సమితి బాలల నిధి'  అని వ్యవహరిస్తున్నారు.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

👉అభివృద్ధి చెందుతున్న దేశాలలో పిల్లలు, వారి తల్లుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి ఈ సంస్థ కృషి చేస్తున్నది.

🍁ఐక్య రాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం - (UNDP)🍁

👉ఈ సంస్థ 1965 నవంబరు 22న స్థాపించ బడింది. ప్రధాన కార్యాలయం న్యూయార్కు నగరంలో ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు వాటిసంపదను వృద్ధి చేసుకొనేందుకు అవసరమైన శిక్షణ, వైజ్ఞానిక సహాయ కార్య క్రమాలకు ఈ సంస్థ నిధులు సమకూరుస్తుంది. 1990 నుండి యు.ఎన్.డి.పి. యేటా మానవా భివృద్ధి నివేదికను విడుదల చేస్తున్నది.

🍁ఐక్య రాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం - (UNEP)🍁

👉స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్లో 1972 జూన్ 5న నిర్వహించిన పర్యావరణ సదస్సు ఫలితంగా యు.ఎన్.ఇ.పి. రూపు దిద్దుకొంది.

🍁ఆహార మరియు వ్యవసాయ సంస్థ - (FAO)🍁

👉ప్రధాన కార్యాలయం రోమ్ నగరంలో ఉంది. 1945 అక్టోబరు 16న కెనడా దేశపు నగరం  క్విబెక్ లో జరిగిన సమావేశంలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు.ఆ కారణం గానే యేటా అక్టోబరు 16ను ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. పౌష్టికాహారం అందించ డం, జీవన ప్రమాణాలు మెరుగు పరచడం, గ్రామీణ ప్రజల స్థితిగతులను అభివృద్ధి చేయడం, ఆహార, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిమి, పంపిణీని మెరుగు పరచడం ఈ సంస్థలక్ష్యాలు.

🍁అంతర్జాతీయ కార్మిక సంస్థ - (ILO)🍁

👉ఈ సంస్థ కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండు  దేశం జెనీవాలో ఉంది. 1919 ఏప్రిల్ 11న  నానాజాతి సమితి అనుబంధ సంస్థగా ఈ సంస్థ ఏర్పాటయ్యింది. అనంతరం ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థగా రూపు దిద్దుకొంది.

👉ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికుల జీవన ప్రమాణాలు స్థాయిని పెంపొందించడానికి ఈ సంస్థ కృషి చేశ్తున్నది. 1969లో ఈ సంస్థకు  నోబెల్ శాంతి బహుమతి లభించింది.

🍁ప్రపంచ ఆరోగ్య సంస్థ - (WHO)🍁

👉1948 ఏప్రిల 7న ఈ సంస్థ ప్రారంభమైంది. దీని కేంద్ర కార్యాలయం
స్విట్జర్లాండు దేశంలో  జెనీవాలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలంద రికీ అత్యుత్తమ ఆరోగ్యసేవలు అందించడం, అంటు వ్యాధుల నివారణ ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు.

👉ఇవే కాకుండా మరికొన్ని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలుగా పనిచేస్తున్నాయి.@𝒔𝒓𝒆𝒆𝒏𝒊𝒗𝒂𝒔@

💟💟💟💟💟💟💟💟💟💟

18 October, 2019

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @

🌹✍తెలుగువారికి తొలి జ్ఞానపీఠాన్ని అందించిన కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు.. విశ్వనాథ వారి ఏ రచన అయినా సరే భారతీయ ఆత్మను, జీవుని వేదనను ప్రతిబింబించేదే. ప్రతీ అక్షరంలోను అసాధారణ ఊహాశక్తిని, అద్భుత రచనాశైలిని నింపి పాఠకుల హృదయాలలోకి పరుగులెత్తించగలిగిన శక్తి ఆయన సొంతం. తెలుగు సాహిత్య ప్ర‌క్రియ‌ల్లో విశ్వనాథ వారు స్పృశించని ప్రక్రియలేదు. తన రచనల ద్వారా కులాతీత, మతాతీత విధానాలను ఎండగట్టారు. ఆధునిక తెలుగు ర‌చ‌యిత‌ల్లో ఆయ‌న పేరు లేకుండా తెలుగు సాహిత్య చరిత్ర‌ గురించి వివ‌రించ‌లేం. అలాంటి మ‌హానుభావుడి వర్ధంతి నేడు.ఆ కవిసామ్రాట్ గురించి కొన్ని విషయాలు..✍🌹

💟💟💟💟💟💟💟💟💟💟






రావూరి భరద్వాజ

@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @

🌹✍ఏడో తరగతి వరకు మాత్రమే చదువుకొని తెలుగు సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న  ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత "రావూరి భరద్వాజ" గారి వర్ధంతి నేడు..  ఆయన ఎన్నో డాక్టరేట్లు తన పరం చేసుకున్నారు.. ఆయన గురించి కొన్ని విషయాలు..✍🌹

💟💟💟💟💟💟💟💟💟💟





థామస్ అల్వా ఎడిసిన్

@🇸 🇷 🇪 🇪 🇳 🇮 🇻 🇦 🇸 @

🌹🔭నేడు థామస్ ఆల్వా ఎడిసన్ గారి వర్ధంతి🔭🌹

👉థామస్ ఆల్వా ఎడిసన్... ఈ పేరు చెప్పగానే మనకు కరెంటు బల్బు గుర్తొస్తుంది. అంతకంటే ముందు గుర్తురావాల్సింది ‘‘ ప్రతి ఓటమి గెలుపునకు పునాది’’ అని. ఎందుకంటే బల్బు కనిపెట్టడానికి ముందు ఎడిసన్ 10 వేల సార్లు విఫలమాయ్యరు. అయినా నిరాశ చెందకుండా విజయం సాధించి మన జీవితాల్లో వెలుగులు నింపారు. బల్బు కనిపెట్టిన అనంతరం ఆయణ్ను ఓ జర్నలిస్టు ‘సర్ మీరు 10 వేల సార్లు విఫలమయ్యారట కదా అని ప్రశ్నిస్తే’ ...దానికి ఎడిసన్ సమాధానమిస్తూ...’ బల్బుని ఎలా తయారు చేయగలమో మీ అందరికి ఒకేలా తెలుసు కానీ, నాకు ఎలా తయారు చేయకూడదో పదివేల విధానాలు తెలుసు’ అని చెప్పారు. ఇది ఒక్కటి చాలదా ఎడిసన్ ఎంత సానుకూల దృక్ఫథంతో ఉంటాడో అని తెలుసుకోడానికి. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న అన్నీ ఎలక్టాన్రిక్ వస్తువులకు మూలం ఎడిసస్ ఆలోచనలే అంటే మీరు నమ్మగలరా.ఈ రోజు ఎడిసన్ గారి వర్ధంతి సందర్భంగా కొన్ని విషయాలు..

💟💟💟💟💟💟💟💟💟💟